)
PM Modi In China After 7 Years: భారత ప్రధాని మోదీ ఏడేళ్ల తర్వాత చైనాకు వెళ్లారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) వార్షిక్ సమ్మిట్లో ప్రధాని పాల్గొననున్నారు. టియాన్ జిన్లో రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ ఉంటుంది. ఆదివారం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. భారత్పై అమెరికా విధించిన టారిఫ్ల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అటు చైనాతోనూ ట్రంప్ వివాదం పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది.
2020లో గల్వాన్ ఘర్షణ, తూర్పు లడఖ్లో సైనిక ప్రతిష్టంభన కారణంగా భారత్-చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ భేటీలో రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. మోదీ ఒక ఇంటర్వ్యూలో భారత్-చైనా సంబంధాలు చాలా ముఖ్యమని, రెండు దేశాల మధ్య శాంతి, సహకారం ప్రాంతీయ, ప్రపంచ శ్రేయస్సుకు దోహదపడతాయని చెప్పారు.
ఈ నెలలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత్లో పర్యటించారు. సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి.. రెండు దేశాల మధ్య విమాన సేవలు, వీసా సౌకర్యాలను తిరిగి ప్రారంభించడానికి ఆయన అంగీకరించారు.
ఈ సమావేశంలో మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కూడా చర్చలు జరపనున్నారు. ట్రంప్ విధించిన సుంకాలు, ఉక్రెయిన్తో రష్యా వివాదం, గాజా పరిస్థితులపై వీరు చర్చించే అవకాశం ఉంది.
అమెరికా విధించిన సుంకాలు భారత్-అమెరికా సహకారాన్ని దెబ్బతీశాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత్, రష్యా, చైనాతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు ట్రంప్ భారత్పై 50 శాతం సుంకాలు విధించారు. ఈ పరిస్థితి భారత్ను చైనా, రష్యాతో మరింత సన్నిహితంగా ఉండేలా చేసింది. ఆ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం మెరుగుపరుచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook