
Shubhanshu Shukla Space Travel: ప్రపంచ అంతరిక్ష యాత్రలో మరో సువర్ణాధ్యయం లిఖించబడింది. భారతీయలు గర్వంతో తలెత్తుకునే రోజు రానే వచ్చింది. ఎట్టకేలకు భారత్ కు చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు బయలు దేరారు. ఆయనతో పాటు వివిధ దేశాలకు చెందిన మరో ముగ్గరు అస్ట్రోనాట్స్ స్పేస్ ఎక్స్ కు చెందిన యాక్సియం -4 (axiom mission 4) రోదసిలోకి వెళ్లారు. ఇప్పటి వరకూ ఏడు సార్లు వాయిదా పడుతూ వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు ఎట్టకేలకు వాతావరణం సహా అన్ని అనుకూలించడంతో ఎట్టకేలకు అంతరిక్ష యాత్ర మొదలైంది. అమెరికా కు చెందిన నాసా వెల్లడించిన వివరాల ప్రకారం, యాక్సియం-4 మిషన్ ప్రయోగం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం కౌంట్ డౌన్ పూర్తి కావడంతో 12 గంటల 1 నిమిషానికి నింగిలోకి యాక్సియం 4 నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ ఈ ప్రయోగానికి వేదికగా నిలిచింది. ఈ వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు దాదాపు 28 గంటల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం అవుతుందని నాసా తెలిపింది.
ఈ ప్రతిష్ఠాత్మక యాత్రను అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ 'యాక్సియం స్పేస్' నిర్వహిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు ఈ మిషన్లో కీలక భాగస్వాములుగా ఉన్నాయి. ఫాల్కన్-9 రాకెట్ ఈ స్పేస్ క్యాప్సూల్ను నింగిలోకి మోసుకెళ్లింది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్గా కీలక బాధ్యతలు ఆయనపైనే ఉన్నాయి. మొత్తం మిషన్ కు ఆయనే గ్యాంగ్ లీడర్ అని చెప్పాలి. శుభాంశు శుక్లా నేతృత్వంలోని బృందం అక్కడ 14 రోజుల పాటు బస చేస్తుంది. ఈ సమయంలో వారు భారరహిత స్థితిలో పలు కీలకమైన శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా అంతరిక్షం నుంచే భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటిస్తారు.వాస్తవానికి ఈ ప్రయోగం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అయితే మే 29నే జరగాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.
అన్ని అడ్డంకులను అధిగమించి ఇప్పుడు ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తై నింగిలోకి అది కూడా భారత శాస్త్రవేత్త కనుసన్నల్లో ఈ ప్రయోగ జరగడం భారతీయులందరికి గర్వకారణమనే చెప్పాలి. ఈ ప్రయోగం 2027 భారత్ చేపట్టబోయే గగన్ యాన్ ప్రయోగానికి ఉపయోగపడనుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో తరుపున శుభాంశు శుక్లా ఏడు ప్రయోగాలు చేయనున్నారు. ముఖ్యంగా అంతరిక్ష యాత్రల వల్ల షోషకాహారం, మన నాడీ వ్యవస్థ పనితీరుకు సంబంధించిన ప్రయోగాలున్నాయి. భార రహిత స్థితిలో ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు , మన రోగ నిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయనేది ఇందులో తేల్చనున్నారు. అంతేకాదు ఈ కేంద్రంలో 31 దేశాలకు సంబంధించి 60 కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు చేయనున్నారు. దీంతో భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాలు చేయాలనుకునే వారి కోసమే కాదు.. ఇతరత్రా ఉద్దేశ్యాల కోసమే ఈ ప్రయోగాలు చేయనున్నట్టు సమాచారం. 1984లో సోవియట్ యూనియన్ రష్యా సహాకారంతో ఇంటర్కాస్మోస్ప్రోగ్రామ్ కింద సోయుజ్ టి-11 వ్యోమనౌకలో రాకేశ్ శర్మ అంతరిక్ష యాత్ర చేసారు. ఆ తర్వాత 41 యేళ్లకు శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు వెళ్లారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.