
Sudan Landslide Thousand Died: కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి మర పర్వత ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయని సుడాన్ ప్రభుత్వం తెలిపింది. దాని ప్రభావంతో గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అంతర్జాతీయ సమాజం తమకు సహాయం చేయాలని వేడుకుంటుంది. ఆఫ్రికా దేశం సుడాన్ లో ఘోర ప్రకృతి విపత్తు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే ఊరిలో 1000 మందికి పైగా మరణించారు. ఆగస్టు 31న కొండ చరియలు విరిగిపడి ఘోర విపత్తు తలెత్తిందని లిబరేషన్ ఆర్మీ తెలిపింది. ఈ ఘటనలో కేవలం ఒక్కరే బతికి ఉన్నారని కూడా చెప్పారు.
అంతేకాదు ఈ గ్రామం ప్రస్తుతం పూర్తిగా బురదతో మునిగిపోయిందని సుడాన్ లిబరేషన్ నాయకుడు అబ్దుల్ వహీద్ నూర్ అన్నారు. ప్రధానంగా ఇక్కడ సుడాన్ సైన్యం పారామీటర్ దళం మధ్య జరుగుతున్న యుద్ధంతో ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రకృతి కూడా కన్నీరుగా చేయడంతో ఇలా ఒక గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అయితే ప్రధానంగా ప్రాంతంలో ప్రస్తుతం ఆహారం మందుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. కొండ చరియలు విరిగిపడటంతో గ్రామానికి రాకపోకలు కూడా అడ్డుగా నిలిచాయి. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సహాయ సంస్థలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో ప్రధానంగా పురుషులు, మహిళలు, పిల్లలు ఉన్నారు.
ఇది పశ్చిమ సుడాన్ లోని మర్రా పర్వత ప్రాంతంలో జరిగింది. ఇక పారా మిలిటరీ ఉత్తర డర్ఫార్ రాష్ట్రంలోని సైన్యం వద్ద జరుగుతున్న అంతర్యుద్ధం రెండేళ్లుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా మర్రా పర్వత ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు. కానీ ఇక్కడ సరైన ఆహార నీటి వసతులు కూడా వాళ్లకి లేకుండా పోయాయి ఇక్కడ జనాభా సగానికి పైగా ఆకలితో కొట్టుముట్టాతుంది. లక్షలాదిమంది ఆ ప్రాంతాలను కూడా ఇప్పటికే వదిలి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ప్రకృతి కన్నెర్రా చేయడంతో వేల సంఖ్యలో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook