
Donald Trump US Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వికృత చేష్టలకు పని చెప్పాడు. ప్రపంచంలోని పలు దేశాలపై అధిక సుంకాలను విధిస్తూ ఆదేశాలు జారీ చేశాడు. సుమారు 70 దేశాలకు ఈ సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించాడు. మిత్రదేశం అని భారత్ పేరు చెప్పుకునే ట్రంప్.. భారతదేశానికి ఎక్కువ సుంకాలను విధించి, దాయాది దేశమైన పాకిస్థాన్ కు ఆశ్చర్యకరంగా టారిఫ్ తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. 10 నుంచి 41 శాతం వరకు సుంకాలను విధించి అమలు చేసే ఉత్తర్వులపై ఆయన సంతకం చేశాడు. అత్యధికంగా సిరియా దేశంపై 41 శాతం టారిఫ్ విధించినట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై టారిఫ్ను డొనాల్డ్ ట్రంప్ భారీగా పెంచారు. కెనడా నుంచి అమెరికాకు దిగుమతులపై సుంకాన్ని 25 శాతం నుంచి 35 శాతానికి పెంచేశాడు. బ్రెజిల్ దేశంపై ప్రస్తుతం పది శాతం ఉండగా.. దాన్ని 40 శాతానికి పెంచేశారు. ఇక మిత్రదేశమైన భారత్పై 25 శాతం టారిఫ్ విధించాడు. కానీ, పాకిస్థాన్పై కేవలం 10 శాతం సుంకాన్ని మాత్రమే విధించారు. అంతే కాకుండా పాక్పై 29 శాతంగా ఉన్న పన్నును 19 శాతానికి తగ్గించేశాడు. అయితే సుంకాల జాబితాలో లేని దేశాల దిగుమతుపై 10 శాతం సుంకం ఉంటుందని ట్రంప్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశాడు.
వివిధ దేశాల మధ్య పరస్పర సుంకాలను సవరించడం సహా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు ఆగస్టు 1 వరకు ట్రంప్ గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం విధించిన టారిఫ్లు ఏడు రోజుల్లో అమలు కానున్నాయి. కానీ.. కెనడా, భారత్ వంటి దేశాలపై విధించిన టారిఫ్లు నేటి నుంచే (ఆగస్టు 1) అమలు కానున్నాయని ట్రంప్ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook