US Vice Presidet: సతీ సమేతంగా భారత్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్..

US Vice Presidet: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో.. భారత, అమెరికా సంబంధాలు గతంలో కంటే బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ చేరుకున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 21, 2025, 11:01 AM IST
US Vice Presidet: సతీ సమేతంగా భారత్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్..

US Vice Presidet: భారత్ లో నాలుగు రోజులు పర్యటనలో భాగం  అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాసేపటి క్రితమే భారత్ కు తన సతీసమేతంగా చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ లో కేంద్ర రైల్వే, సమాచార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు.  అమెరికా సెకండ్‌ లేడీ హోదాలో స్వదేశానికి వచ్చిన భారత దేశపు ఆడపడుచు అదులో  తెలుగమ్మాయి అయిన ఉషా చిలుకూరి కూడా తన భర్త ముగ్గురు పిల్లలతో కలిసి సొంత గడ్డపై అడుగుపెట్టారు.

Add Zee News as a Preferred Source

జేడీ వాన్స్ వాణిజ్య, భౌగోళిక రాజకీయ అంశాలపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరపన్నారు.  ఈ నేపథ్యంలో ప్రధాని నివాస ప్రాంతమైన లోక్ కళ్యాణ్ మార్క్ లో ఉన్న  ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి వాన్స్ చేరుకుంటారు. అక్కడ జేడీ వాన్స్ దంపతులకు భారతీయ వంటలతో  ప్రధాని మోడీ  విందు ఇవ్వనున్నారు.

నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు జైపుర్‌లో చారిత్రక ప్రదేశాలను వాన్స్ దంపతులు విజిట్ చేయనున్నారు.  ఆ తర్వాత తాజ్ మహల్ తో పాటు పలు సందర్శనీయ స్థలాలను వాళ్లు వెళ్లనున్నారు.  జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాళ్ల  పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ గ్రామం కావడం విశేషం.  ఆమె అమెరికాలో పుట్టి పెరిగింది.  ఉష తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970ల్లో యూఎస్ కు ఉద్యోగ రీత్యా  వలస వెళ్లారు. తర్వాత యేల్‌ లా స్కూల్‌లో ఉషా, జేడీ వాన్స్‌ తొలిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త లవ్ గా మారింది. వీరిద్దరు 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి  చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లులు ఉన్నారు. అయితే అగ్రరాజ్య ఉపాధ్యకుడిగా జేడీ వాన్స్ విక్టరీ ఉష కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆమె అమెరికా రెండో ‌ లేడీ హోదాలో భారత్‌కు విచ్చేయడం విశేషం.  

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News