)
Iran - Israel Ceasefire: ఒకవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఆ తర్వాత పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం నెలకొంది. ఆ తర్వాత పశ్చిమాసియాలో కీలక దేశాలైన ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య భీకర యుద్దం మొదలైంది. ఇరాన్ అణు బాంబ్ తయారు చేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు అది తయారు చేస్తే తమపైకే ప్రయోగిస్తుందని పలుమార్లు ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయిల్ ముందు జాగ్రత్తగా ఆ దేశంపై దాడి చేసింది. అంతేకాదు ఇరాన్ లోని కీలక అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. ఈ దాడిలో ఇరాన్ దేశానికి చెందిన కీలకమైన స్థావరాలు ధ్వంసం అయ్యాయి. అటు ఇరాన్ కూడా ఇజ్రాయిల్ పై ప్రతి దాడులు చేసింది. ఇజ్రాయిల్ దేశం ఇనుప డ్రోమ్ ను చీల్చుకుంటూ ఆ దేశం ప్రయోగించిన మిస్సైల్స్ ఇజ్రాయిల్ కు తీవ్ర నష్టం కలిగించాయి. మరోవైపు అమెరికా కూడా రంగంలోకి దిగి ‘ఆపరేషన్ మిడ్ హ్యామర్’(అర్ధరాత్రి సుత్తిదెబ్బ) పేరుతో ఇరాన్ పై దాడులకు తెగపడింది.
మొత్తంగా గత 12 రోజులుగా జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధానికి ముగింపు పలికాయి. మరికొన్ని గంటల్లో ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య సీజ్ ఫైర్ (కాల్పుల విరమణ) ఒప్పందం జరగనున్నట్టు ప్రకటించింది. మరో 24 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగిసినట్టు ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ రెండు దేశాలను పొగడ్తలతో ముంచెత్తారు.
మరోవైపు అమెరికాలో పశ్చిమాసియాలో పలు దేశాల్లో తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. అక్కడ నుంచే ఇరాన్ పై దాడులకు తెగపడింది. దీంతో ఇరాన్ కూడా ‘ఆపరేషన్ బషరత్ అల్ ఫాత్’ పేరుతో ప్రతికార చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయిల్ శాంతి వైపు అడుగులు వేయడం శుభపరిణామమని చెప్పారు. ఇరాన్ ఇకనైనా శాంతి వైపు అడుగులు వేస్తుందనే ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రెండు దేశాలు యుద్దానికి ఎండ్ కార్డ్ వేసాయని ట్రంప్ ప్రకటించడం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.