)
Iran 14 Points to America: పశ్చిమాసియాలో కొనసాగుతోన్న ఉద్రిక్తతల నడుమ ఇరాన్ చమురుపై ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేయాలని అమెరికా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ వెల్లడించింది. దీంతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం..ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే చైనా సంస్థలపై ఆంక్షలను ఎత్తివేసే అంశానని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆంక్షలను తొలగిస్తారనే వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఒకవేళ ఆంక్షలను ఎత్తివేస్తే.. చమురు ధరలు గణనీయంగా తగ్గుతాయని అంచనా.
ఉద్రిక్తతలను తగ్గించేందుకు టెహ్రాన్ తన తాజా 14-సూత్రాల తీర్మానం ముసాయిదాను ముందుకు తెచ్చిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.ఏది ఏమైనా తుది, విస్తృత ఒప్పందంలో భాగంగా అమెరికా విధించిన అన్ని ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం తప్పనిసరిగా ఉండాలని ఇరాన్ చెబుతూ వస్తోంది. ఇరాన్పై ఆర్థికంగా సహా అన్ని విధాలుగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఆ దేశ చమురు వాణిజ్యంపై అమెరికా ఆంక్షలు విధించింది. తొలి దశలో అమెరికా కంపెనీలు ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని నిషేధించారు. ఆంక్షల రెండవ దశలో ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేసే అమెరికాయేతర సంస్థలు, బ్యాంకులు, విదేశీ ప్రభుత్వాలను కూడా చేర్చారు.
రెండు రోజుల చైనా పర్యటనలో ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని అధ్యక్షుడు షీ జిన్పింగ్ను ఒప్పించడంలో ట్రంప్ విఫలమయ్యారు. ఇరాన్కు సైనిక పరికరాలు, ఆయుధాలను సరఫరా చేయబోమని బీజింగ్ హామీ ఇచ్చింది. కానీ చమురు కొనుగోలును కొనసాగిస్తామని తెలిపింది. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నా.. శాంతి చర్చలలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. చర్చలు విఫలమైతే సైనిక చర్య సహా ప్రత్యామ్నాయాల గురించి ట్రంప్ తన జాతీయ భద్రతా బృందం, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ సహా తన మిత్రపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్పై ఆంక్షలను అమెరికా ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాము 14 సూత్రాల ప్రణాళికను సమర్పించిన తర్వాత అమెరికా తమ అభ్యంతరాలను వ్యక్తం చేసిందని ఇరాన్ తెలిపింది. మేము కూడా మా ఆందోళనలను తిరిగి వాషింగ్టన్కు చెప్పాము. ఇరాన్ ప్రణాళికను తిరస్కరించినట్లు అమెరికా బహిరంగంగా ప్రకటించినప్పటికీ, పాకిస్థానీ మధ్యవర్తి నుంచి మాకు కొన్ని సవరణ సూచనలు, పరిగణనలు అందాయి. అమెరికాకు మా అభిప్రాయాలను పంపిన మరుసటి రోజే, పాకిస్థాన్ నుంచి మాకు కొన్ని ప్రతిపాదనలు అందాయి. వాటిని గత కొద్ది రోజులుగా సమీక్షించాము. ఆ తర్వాత మా అభిప్రాయాలు కూడా తిరిగి అమెరికాకు పంపించాము. ఈ ప్రక్రియ పాకిస్థానీ మధ్యవర్తి ద్వారా కొనసాగుతోంది. హక్కుల విషయంపై చర్చలు జరపడానికి, రాజీపడటానికి మేము సిద్ధంగా లేమని ఇరాన్ తేల్చి చెప్పింది. యురేనియం శుద్ధి చేసుకునే ఇరాన్ హక్కును ఎన్పీటీ కింద గుర్తించారు. ఈ హక్కు ఇప్పటికే ఉన్నందున ఇతరులు ఇరాన్కు ఈ హక్కును గుర్తించాల్సిన అవసరం లేదు. తాము శత్రువు బెదిరింపులకు ఎలాగైతే భయపడమో, అలాగే వారి ప్రశంసలకు కూడా ఉత్సాహపడము. తాము మా సామర్థ్యాలను నమ్ముకున్నాం..శత్రువును ఎదుర్కోవడానికి భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఇరాన్ పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R7
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe