)
Kulman Ghising Nepal Interim PM : హిమాలయ రాజ్యం నేపాల్ రావణకాష్టంలా మారిపోయింది. అక్కడ సోషల్ మీడియాపై పెట్టిన ఆంక్షలు ఫలితంగా మొదలైన జనరేషన్ Z ఉద్యమం చివరకు ఆ దేశ ప్రభుత్వం కూలిపోయే వరకు వెళ్ళింది. నేపాల్ ప్రధానికి కేపీ ఓలీ శర్మ రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్చలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా నేపాల్ లో విద్యుత్ సంస్కరణలు చేపట్టిన కుల్మాన్ ఘిసింగ్ పేరు తాత్కాలిక ప్రధానిగా ముందుకు రావడం విశేషంగా మారింది.
కుల్మాన్ ఘిసింగ్ 1970 నవంబర్ 25న నేపాల్లోని రామేఛాప్ జిల్లాలో బేతన్ గ్రామంలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి విద్యారంగంలో తన ప్రతిభ కనబరిచారు. ప్రాథమిక విద్య స్థానిక పాఠశాలలోనే పూర్తిచేసి, తర్వాత రాజధాని ఖాట్మండులో ఆయన ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. అనంతరం ఆయన ఇంజనీరింగ్లో భారత్లోని జంషెడ్పూర్ Regional Institute of Technologyలో పూర్తి చేశారు.తర్వాత నేపాల్లోని Pulchowk Engineering Collegeలో మాస్టర్స్ పూర్తిచేశారు. విద్యుత్ రంగంలో తన ప్రతిభను కనపరిచేందుకు కృషి చేశారు
నేపాల్ లో విద్యుత్ సమస్య చాలా తీవ్రంగా ఉండేది. పర్వత రాజ్యం అయిన నేపథ్యంలో మా చుట్టుపక్కల మారుమూల ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అనేది ఒక సవాలుగా ఉండేది. చాలా ప్రాంతాల్లో రోజుకు 14–18 గంటలపాటు విద్యుత్ లేని పరిస్థితి ఉండేది. ఇళ్లు, పరిశ్రమలు, పాఠశాలకు విద్యుత్ కొరత తీవ్రంగా ఉండేది. దీంతో 2016లో Nepal Electricity Authority (NEA) మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కుల్మాన్ ఘిసింగ్ ఈ సమస్య ముగింపు కోసం తీవ్రంగా చర్యలు తీసుకున్నారు.
ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా నేడు నేపాల్ విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కింది. విద్యుత్ పంపిణీ వ్యవస్థను సమర్థంగా నిర్వహించడంతో పాటు, పవర్ థెఫ్ట్ చేయడంపైన కఠిన చర్యల తీసుకున్నారు. అలాగే కొత్త విద్యుత్ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. విద్యుత్ పంపిణీ సమయాల్లో పారదర్శకత ఉండేలా ప్రయత్నించారు. ఫలితంగా కొన్ని నెలల్లోనే నేపాల్ ప్రజలకు 24 గంటల విద్యుత్ అందుబాటులోకివచ్చింది. ఈ కారణంగా ఘిసింగ్ ను ఒక హీరోగా జనం చూశారు.
రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది. ప్రస్తుతం అవినీతిలో కూరుకుపోయిన పాత ప్రభుత్వ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆయన పేరు తాత్కాలిక ప్రధానమంత్రి పదవి కోసం వినిపించడం ఆసక్తి కరంగా మారింది.
తాజాగా Gen-Z నిరసనలు ఊపందుకున్న తర్వాత, నేపాల్లో సుశీల కార్కి (మాజీ చీఫ్ జస్టిస్), బాలేంద్ర షా (కాట్మండు మేయర్), కుల్మాన్ ఘిసింగ్ వంటి పేర్లు తాత్కాలిక ప్రధాని కోసం చర్చలో ఉన్నాయి. ముఖ్యంగా యువతలో ఆయనకి మంచి పాజిటివ్ ఇమేజ్ ఉండటం ఒక ప్లస్ పాయింట్.గా చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.