AP Assembly Elections 2024: జగన్, బాబు, పవన్ సహా ఏపీలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు..

AP Assembly Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

1 /9

ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీతో పాటు కడప పార్లమెంట్‌ నియోజకవర్గంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

2 /9

  ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి మంగళగిరిలోని ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

3 /9

పవన్ కళ్యాణ్‌ తన సతీమణి అన్నాలెజినోవాతో  కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

4 /9

హిందూపురంలో తన భార్య వసుంధరా దేవితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న నందమూరి బాలకృష్ణ.

5 /9

  తన భర్త వై.యస్.జగన్మోహన్ రెడ్డితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న వై.యస్.భారతి

6 /9

  ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

7 /9

  నారా లోకేష్ తన సతీమణి బ్రాహ్మణితో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

8 /9

అశోక్ గజపతి రాజు విజయనగరం జిల్లా కేంద్రంలో తన ఓటు వేసారు.

9 /9

  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షరాలు వై.యస్.షర్మిల కడపలో తన ఓటు హక్కు వినియోగించుకుంది.