Yadadri Dress Code: యాదాద్రికి వస్తున్న భక్తులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్తరూల్.. అలా వస్తే నో దర్శనం..


Traditional Dress: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంకు వచ్చే భక్తులంతా ఇక మీదట సాంప్రదాయ వస్త్రధారణలోనే రావాలని యాదాద్రి ఆలయ అధికారులు సూచించారు. జూన్ 1 నుంచి ఈ నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. 

1 /8

తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రతిరోజు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయంను డెవలప్ చేసిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు.

2 /8

ముఖ్యంగా  శనివారం, ఆదివారం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.  

3 /8

చాలా మంది భక్తులు తెలంగాణ తిరుపతిగా భావిస్తున్నారు. తిరుపతి వరకు వెళ్లలేని భక్తులు యాదాద్రికి వెళ్లి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి దేవస్థానం బోర్డు ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి వారి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు కొన్నిసూచనలు చేసింది.

4 /8

యాదాద్రి ఆలయంలో ఆర్జీత సేవల్లో పాల్గొనే భక్తులు అంటే.. కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, హోమం, జోడు సేవ, శ్రీ సుదర్శన నరసింహ హోమం, అష్టోత్తరం, కుంకుమర్చన మొదలైన కార్యక్రమాలకు హజరయ్యే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని కోరింది. 

5 /8

తిరుపతిలో మాదిరిగానే.. పురుషులు పంచా లేదా తెల్ల లుంగీ, అమ్మాయిలు పంజాబీ డ్రెస్ లు, మహిళలు చీరలు ధరించి ఆర్జీత సేవాలలో పాల్గొనవచ్చని ఆలయం అధికారులు తెలిపారు. ఈ డ్రెస్ కోడును ఫాలో అయిన వాళ్లకు మాత్రమే ఆర్జీతసేవల్లో పాల్గొనే అవకాశం  కల్పిస్తారని దేవస్థానం సిబ్బంది తెలిపింది.

6 /8

ముఖ్యంగా సాంప్రదాయ డ్రెస్ కోడ్ నిబంధనను జూన్ 1 నుంచి అమల్లోకి రానుందని తెలుస్తొంది. ఈ నేపథ్యంలో భక్తులంతా పై సూచనలను గమనించాలని కూడా దేవ స్థానం సిబ్బంది కోరారు. ప్రతి ఒక్కరు తమకు సహాకరించాలని కూడా ఆలయం ఈవో ఒక ప్రకనటలో వెల్లడించారు

7 /8

యాదాద్రిలో భక్తుల వీఐపీ బ్రేక్ దర్శనానికి డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశారు. స్వామివారి విరామ దర్శనానికి వచ్చే భక్తులకు ఈ నిబంధన నియమం పాటించాలని సూచించారు. అదేవిధంగా సాధారణ ధర్మ దర్శనానికి క్యూ లైన్‌లో వచ్చే భక్తులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉందని యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

8 /8

ఇదిలా ఉండగా ప్రస్తుతం యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి జయంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో స్వామివారికి విశేషంగా పూజలు, అభిషేకాలు, ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఎండాకాలం సెలవులు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున యాదాద్రికి తరలివస్తుండటంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.