ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు..

పెరుగుతున్న పెట్రోల్ ధరల భారాన్ని తగ్గించుకోవడానికి చాలామంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

';

రూ.80 వేల లోపే..

కొంతమంది అయితే రూ.80 వేల లోపే లభించే అధిక మైలేజ్ ఇచ్చే బైకులను కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి బైకులనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే..

';

బజాజ్ ప్లాటినా..

ప్రస్తుతం మార్కెట్లో బజాజ్ ప్లాటినా ధర రూ. 67 వేల లోపే లభిస్తోంది. అలాగే కొన్నిచోట్ల ఈ బైక్ పై ప్రత్యేకమైన ఆకర్షణీయమైన ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.

';

ప్రీమియం ఫీచర్స్‌తో ప్లాటినా

ఇటీవలే బజాజ్ కంపెనీ ఈ ప్లాటినాను ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇది లీటర్ పెట్రోల్ కి 70 నుంచి 75 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.

';

టీవీఎస్ స్పోర్ట్స్..

ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులలో TVS స్పోర్ట్స్ కూడా ఒకటి. దీని ధర తక్కువే అయినప్పటికీ ఇది 75 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలుగుతుంది.

';

రూ. 71 వేల లోపే..

ఇక ఈ టీవీఎస్ స్పోర్ట్స్ ధర విషయానికొస్తే ప్రస్తుతం ఇది మార్కెట్లో రూ. 71 వేల లోపే అందుబాటులో ఉంది. ఇది వివిధ రకాల ఆకర్షణీయమైన కలర్స్లో మార్కెట్లో కంపెనీ విక్రయిస్తోంది.

';

హీరో స్ప్లెండర్ ప్లస్..

హీరో మార్కెట్లోకి లాంచ్ చేసిన ఎక్కువ మైలేజీ ఇచ్చే బైకుల్లో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. ఇది ప్రస్తుతం మార్కెట్లో ధర రూ.78 వేల లోపు లభిస్తోంది..

';

మైలేజీ..

ఇక హీరో స్ప్లెండర్ ప్లస్ మైలేజ్ వివరాల్లోకి వెళితే.. కేవలం లీటర్ పెట్రోల్ కే దాదాపు 80 కిలోమీటర్ల వరకు మైలేజీ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

';

VIEW ALL

Read Next Story