కావాల్సిన పదార్థాలు:

బియ్యం పిండి - 1 కప్పు, ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి), కారం - 1 టీస్పూన్, జీలకర్ర - 1 టీస్పూన్

';

కావాల్సిన పదార్థాలు:

పసుపు - 1/4 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేయించడానికి, తగినంత గరం మసాలా

';

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి, కారం, జీలకర్ర, పసుపు, ఉప్పు, గరం మసాల వేసి కలపాలి.

';

తయారీ విధానం పార్ట్‌-1:

ఇలా మిక్స్‌ చేసుకున్న పిండిలో కొద్దికొద్దిగా నీరు పోస్తూ చిక్కటి పకోడీ పిండిలా కలుపుకోవాలి.

';

తయారీ విధానం పార్ట్‌-2:

పిండి కులుపుకుని క్రమంలో పిండి మిశ్రమం చాలా గట్టిగా ఉండకూడదు, చాలా పలుచగా ఉండకూడదు.

';

తయారీ విధానం పార్ట్‌-3:

ఆ తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేయాలి. 5 నిమిషాల పాటు వేడి చేసిన తర్వాత..

';

తయారీ విధానం పార్ట్‌-4:

చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుని, వేలితో నొక్కి చిన్న చిన్న రంధ్రాలు చేసి, నూనెలో వేసుకోవాల్సి ఉంటుంది.

';

తయారీ విధానం పార్ట్‌-5:

అన్ని పకోడీలు ఇలాగే వేసి, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. వేడిగా ఉన్నప్పుడే చట్నీ లేదా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది.

';

చిట్కా:

పకోడీలు మరింత కరకరలాడేలా ఉండాలంటే, పిండిలో కొద్దిగా రవ్వ కలపవచ్చు. పకోడీలు చాలా నూనె పీల్చుకోకుండా ఉండాలంటే, నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే వేయాలి.

';

VIEW ALL

Read Next Story