సందర్శించకూడని ప్రాంతాలు

వర్షాకాలంలో పచ్చదనంతో అలుముకుని పర్యాటకులను కొన్ని ప్రాంతాలు ఆకట్టుకుంటాయి. అయితే ఈ వర్షాకాలంలో కొన్ని సందర్శించకూడని ప్రాంతాలు కూడా ఉన్నాయి.

';

వెళ్తే ప్రమాదాల బారిన

తెలియకుండా ఈ ప్రాంతాలను సందర్శించడానికి వెళ్తే ప్రమాదాల బారినపడుతారు.

';

డార్జిలింగ్‌

దేశంలోనే అత్యధికంగా వర్షం కురిసే ప్రాంతం డార్జిలింగ్. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్, సిలిగురి ప్రాంతంలోని కొండల ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురుస్తుంటాయి. వర్షాకాలంలో డార్జిలింగ్ సందర్శించవద్దు.

';

కులు

హనీమూన్‌కు ప్రసిద్ది పొందిన కులు వర్షాకాలంలో సందర్శించకపోవడం మంచిది. వర్షాకాలంలో అక్కడ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ అద్భుతమైన కొండల సందర్శనను వర్షాకాలంలో వాయిదా వేసుకోవాలి.

';

కూర్గ్‌

భారతదేశంలో కొండ ప్రాంతాలకు ఆలవాలమైన కూర్గ్‌ను ఈ కాలంలో సందర్శించకూడదు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో వర్షాకాలంలో కూర్గ్‌ సందర్శన శ్రేయస్కరం కాదు.

';

అస్సాం

ప్రకృతి, పచ్చదనానికి పేరుపొందిన అస్సాం రాష్ట్రాన్ని మాత్రం వర్షాకాలంలో సందర్శించరాదు. ఈ సమయంలో భారీగా వరదలు సంభవిస్తాయి. వర్షాకాలం యాత్రికులు అస్సాంను మినహాయించాలి.

';

గోవా

అందమైన సముద్రపు తీర ప్రాంతమైన గోవాను వర్షాకాలంలో సందర్శించకూడదు. భారీ వర్షాలతో గోవా పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయి.

';

ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీని సందర్శించడానికి వర్షాకాలం సరికాదు. ఈ సమయంలో భారీ వర్షాలు కురిసి పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుంది. వర్షాకాలం తర్వాత దేశ రాజధానిని సందర్శించవచ్చు.

';

ముంబై

దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై వర్షాకాలంలో ప్రమాదకరంగా ఉంటుంది. వర్షాకాలంలో వరదలతోపాటు భారీగా ట్రాఫిక్ జామ్‌ సమస్యలు ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story