ఇడ్లీ, దోశ పిండి మర్చిపోయి ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే.. ఉదయానికల్లా పుల్లగా మారిపోవడం ఖాయం..
అలా అని పిండి..మొత్తం పడేయలేము.. మరి పిండి బాగా పుల్లగా అయినప్పుడు ఏం చేయాలో ఒకసారి చూద్దాం
పిండి పుల్లగా మారితే.. ఆ పిండిలో కొంచెం కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి పాలు కలుపుకుంటే చాలు. ఇలా చేయడం వల్ల పిండిలోని పులుపు చాలావరకు తగ్గుతుంది.
అంతేకాదు అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ను.. కొద్దిగా తెల్లగా ఉండే పిండిలో వేస్తే చాలు.. పులుపు తగ్గుతుంది.
కాగా ఈ రెమెడీ చేయడానికి..కొద్దిగా అల్లం, పచ్చిమిర్చిని తీసుకొని.. రెండిటిని కలిపి మిక్సీలో వేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను పిండిలో మిక్స్ చేసుకోవాలి.
పైన చెప్పిన రెండు పద్ధతులు కుదరకపోతే.. పుల్లగా మారిన పిండిలో కొద్దిగా బియ్యం పిండి లేదా ఉప్మారవ్వ లేదా ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చు.
ఇలా చెయ్యడం ద్వారా పిండి పరిమాణం కూడా పెరుగుతుంది. అయితే బియ్యం పిండి లేదా ఉప్మా రవ్వ.. కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు కలుపుకుంటే మంచిది.