షుగర్, డయాబెటిస్ ఈ వ్యాధి పేరు చెబితే జనంలో వణుకుపుడుతుంది. ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది.
ఒక్కప్పుడు షుగర్ 50ఏండ్లపై బడిన వారికి వచ్చేది. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ వస్తుంది.
డయాబెటిస్ సైలెంట్ కిల్లర్ వ్యాధి. కొన్ని సార్లు దీని లక్షణాలతో వ్యాధిని మనం గుర్తించవచ్చు.
ప్రతిరోజూ ఉదయాన్నే వేడి నీళ్లలో బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగితే షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. అంతేకాదు కాలక్రమేణ తగ్గే అవకాశం కూడా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.
డయాబెటిస్ వ్యాధి సోకిన వ్యక్తిలో తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. ఈ వ్యాధి కారణంగా శరీరం అంతా కూడా పొడిబారుతుంది.
షుగర్ పేషంట్ల శరీరం తొందరగా హైడ్రేటెడ్ అవుతుంది. హైడ్రేట్ గా ఉంచుకునేందుకు పలు రకాల ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
షుగర్ పేషంట్లు ఆహారంలో ఉప్పు తీసుకోవాలి. తెల్ల ఉప్పుకంటే నల్ల ఉప్పు తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.
బ్లాక్ సాల్ట్ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో సోడియం కంటెంట్ కూడా తక్కువగానే ఉంటుంది.
మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు కూడా బ్లాక్ సాల్ట్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బరువు కూడా తగ్గుతారు.