ఇడ్లీ, దోశల్లోకి ఎంతో రుచిగా ఉంది.. ఆరోగ్యాన్ని కూడా అందించే..క్యారెట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం..
ముందుగా ఓ పావు కేజీ క్యారెట్..సన్నగా తురుముకొని..ఆ తురుమును ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
అందులో..మన రుచికి సరిపడా కారం, ఉప్పు, ఒక స్పూను జీలకర్ర పొడిర, మెంతి పొడి.. కలిపి.. ఒక్క నిమ్మ దబ్బ దానిలో పిండుకోవాలి.
తర్వాత పోపు కోసం..పావు టీ స్పూను ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర కొద్దిగా..ఇంగువ నాలుగు సన్నగా తుంచినా ఎండు మిరపకాయలు వేసి.. వేయించుకోవాలి.
ఎండు మిరపకాయలు వేగాక..అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. తరువాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి.
ఇప్పుడు ఈ తిరగమాతను.. మనము ముందుగా కలిపి ఉంచుకున్న క్యారెట్ మిశ్రమంలో.. వేయాలి. అంతే గుమగుమలాడే.. క్యారెట్ పచ్చడి రెడీ.
రోజు ఇడ్లీ, దోశల్లో.. పల్లీల చట్నీ తిని బోర్ కొట్టిన వారు.. ఈ క్యారెట్ చట్నీని తినడం మంచిది. ముఖ్యంగా ఈ పచ్చడి తినడం ద్వారా మన శరీరంలో బీపీ, షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి.