ముందుగా రెండు గ్లాసుల నీళ్లు పొయ్యి మీద పెట్టి బాగా మరిగించుకోవాలి.
మరోపక్క రెండు స్పూన్ల రాగి పిండిని ఉండలు కట్టకుండా.. చల్లనీతిలో కలుపుకోవాలి.
ఇప్పుడు ముందుగా కలుపుకున్న రాగి పిండిని.. మరుగుతున్న నీతిలో వేసి ఉండలు కట్టకుండా గెంటితో తిప్పుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
ఆ తరువాత స్టవ్ కట్టేసి.. ఈ రాగి పిండి జావని కాసేపు చల్లారనివ్వాలి.
ఇప్పుడు ఇందులో బాగా చిలికిన మజ్జిగ ఒక గ్లాసు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
అంటే ఎంతో రుచికరమైన రాగిజావ సిద్ధం. మరింత రుచి కోసం కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఈ జావాలో వేసుకోవచ్చు.