డయాబెటిస్ ఉన్నవాళ్లు దోశ తినేందుకు ఆలోచిస్తుంటారు. దోశ తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయని బయపడతారు.
షుగర్ పేషంట్లు కఠినమైన ఆహార నియమాలను పాటిస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే నోటిని కట్టేసుకుంటారు. ఏం తిందామన్నా షుగర్ లెవల్స్ పెరుగుతాయని భయం
షుగర్ పేషంట్ల కోసం ఇప్పుడు స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ మీ ముందుకు తీసుకువచ్చాం. ఇది తింటే షుగర్, బీపీ దెబ్బకు నార్మల్ అవుతుంది.
సోయ దోశ తయారు చేసేందుకు పెద్దగా సమయం ఏం పట్టదు. రుచి మాత్రం అద్బుతంగా ఉంటుంది. షుగర్ దోశ ఎలా తయారు చేస్తారో చూద్దాం.
ఒక కప్పు - సోయా పాలు, పావు కప్పు - గోధుమపిండి, సరిపడినంత - నూనె, రుచికి సరిపడా - ఉప్పు, చిటికెడు - బేకింగ్ సోడా, 1 టీస్పూన్ - జీలకర్ర, కొద్దిగా - పచ్చిమిర్చి తరుగు, అరకప్పు - ఉల్లిపాయ తరుగు, కొద్దిగా - కొత్తిమీర తరుగు
ఒక గిన్నెలో గోధమ పిండి, సోయా పాలు పోసి బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమంలో ముందు తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి.
ఈ పేస్టులో కొన్ని వాటర్ పోస్తూ కలిపి ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత పిండిని 15 నిమిషాలు పక్కన పెట్టాలి.
ఇప్పుడు ఈ పిండితో దోశలు వేయాలి. ఇలా తయారు చేసిన దోశలను టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ లేదంటే సాంబర్ తో తినవచ్చు.
పైన చెప్పినట్లుగా మీరూ ట్రై చేయండి. షుగర్ పేషంట్లు ఇది తినే ముందు ఒకసారి మీ వైద్యులను వివరాలు అడిగి తెలుసుకోండి.