తిత్లీ తుఫాను బాధితుల‌కు భారీ సాయం ప్రకటించిన అల్లు అర్జున్

తిత్లీ బాధితుల‌కు భారీ సాయం ప్రకటించిన అల్లు అర్జున్

Last Updated : Oct 20, 2018, 01:46 PM IST
తిత్లీ తుఫాను బాధితుల‌కు భారీ సాయం ప్రకటించిన అల్లు అర్జున్

తిత్లీ పెను తుఫానుతో శ్రీకాకుళం, విజ‌యన‌గ‌రం జిల్లాలు అత‌లాకుత‌ల‌మైన సంగతి తెలిసిందే. తుఫాను ధాటికి అత‌లాకుత‌ల‌మైన ఉత్తరాంధ్ర వాసుల‌కి అండ‌గా నిలిచేందుకు సినీ ప‌రిశ్రమ‌కి సంబంధించిన పలువురు ప్రముఖులు ఆర్ధిక సాయం అంద‌జేస్తున్నారు. తాజాగా తిత్లీ తుఫాను భాదితులను ఆదుకునేందుకు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్ధిక సాయం అందజేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. రూ.25 లక్షలు అందజేస్తున్నట్లు ప్రకటించారు.

 'తిత్లీ ఎంద‌రో జీవితాల‌లో విషాదం నింపింద‌ని తెలిసి క‌ల‌త చెందాను. అందుకే వారికి నా వంతు బాధ్య‌త‌గా రూ.25 లక్షలు విరాళం అందిస్తున్నాను. మీరు కూడా మీకు తోచినంత సాయం చేసి ఇబ్బందుల‌లో ఉన్న వారిని ఆదుకోండి' అని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ఎన్టీఆర్‌, బాలకృష్ణ, వ‌రుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, క‌ళ్యాణ్ రామ్‌, సంపూర్ణేష్ బాబు, నిఖిల్, కార్తికేయ‌, ద‌ర్శకుడు కొర‌టాల శివ త‌దిత‌రులు తిత్లీ తుఫాను బాధితులకు విరాళాలు ప్రకటించారు.  బాలకృష్ణ రూ.25 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ రూ.15 లక్షలు, హీరో కల్యాణ్ రామ్ రూ.5 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు, కొర‌టాల శివ రూ.3 లక్షలు,  కార్తికేయ రూ.2 లక్షలు,  సంపూర్ణేష్ బాబు రూ.50వేలు, వరుణ్ తేజ్ రూ.5 లక్షలు విరాళాలుగా ప్రకటించారు.

తిత్లీ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రూ.2800 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రూ.1200 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఈ సందర్భంగా.. బాధితులను ఆదుకోవడానికి ముందుకురావాలని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందజేయాలని రాష్ట్ర ప్రజలను కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై ప్రముఖులు ఈ మేరకు స్పందిస్తున్నారు.

 

Trending News