ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు

Last Updated : Aug 11, 2018, 07:52 PM IST
ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ పి విజయ్ భాస్కర్ అనే ఓ యువకుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వాల్సి ఉన్న ప్రత్యేక హోదాను ఇవ్వకపోతే టవర్‌పై నుంచి దూకేస్తానని ఆ యువకుడు బెదిరించడంతో కాసేపు అక్కడ ఉత్కంఠకర వాతావరణం ఏర్పడింది. విజయ్ భాస్కర్‌ని కిందికి దిగిరావాల్సిందిగా ధర్మవరం పోలీసులు ఎంత కోరినా.. ఆ యువకుడు మాత్రం తన డిమాండ్ నెరవేరితేనే కిందకు వస్తానని, లేదంటే ఇక్కడి నుంచే కిందకు దూకేస్తానని హెచ్చరించాడు. ధర్మవరం రూరల్ పోలీసు స్టేషన్‌కి సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కోరుతూ విజయ్ భాస్కర్ సంబంధిత అధికారులకు లేఖలు సైతం రాసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
 

Trending News