యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

Last Updated : Sep 22, 2018, 11:11 AM IST
యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

బెంగళూరు నుంచి కాచిగూడ వెళ్తున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దోపిడీ జరిగింది. రైలు మహబూబునగర్‌ జిల్లా దివిటిపల్లి రైల్వేస్టేషన్‌లో ఆగిన సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో రైలు కిటికీల నుంచి నగదు, నగలు దోచుకెళ్లారు. ఐదుగురు ప్రయాణికుల నుంచి మొత్తం 25 తులాల నగలు, రూ.10 వేల నగదు దోపిడీ చేశారు. రైలు కాచిగూడ చేరుకున్న అనంతరం బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సిగ్నల్స్‌ ట్యాంపరింగ్‌ చేసినట్లు అనుమానం

దోపిడీ దుండగులు సిగ్నల్స్‌ ట్యాంపరింగ్‌ చేసినట్లు రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్‌ అనుమానిస్తున్నారు. సిగ్నల్స్‌ కట్‌ చేసిన అనంతరం దాదాపు 20 నిమిషాలపాటు రైలు దివిటిపల్లి రైల్వేస్టేషన్‌లో మిలిచింది. ఈ సమయంలోనే ఆరుగురు దుండగులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న వివ‌రాల‌ను డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.

Trending News