భరత్ బహిరంగ సభకు ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్

ఏప్రిల్ 7వ తేదీ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం ఓ తారాతీరాన్ని తలపించనుంది.

Last Updated : Apr 7, 2018, 03:57 PM IST
భరత్ బహిరంగ సభకు ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్

ఏప్రిల్ 7వ తేదీ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం ఓ తారాతీరాన్ని తలపించనుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వేదికపై వుంటేనే ఆ వేదికకు ఎంతో అందం వస్తుంది. ఆ వేదికపై ఎంతో సందడి వుంటుంది. అలాంటిది అదే వేదికపైకి సూపర్ స్టార్‌తోపాటే టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తే చూడ్డానికి ఆ దృశ్యం ఇంకెలా వుంటుంది ? అవును, శనివారం ఈ ఇద్దరూ కలిసి భరత్ బహిరంగ సభా వేదికపై నుంచి తెలుగు సినిమా ఆడియెన్స్‌కి అభివాదం చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ఏప్రిల్ 20వ తేదీన థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాతలు రేపు 'భరత్ బహిరంగ సభ' పేరిట ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు యంగ్ టైగర్ ముఖ్య అతిథిగా రానుండటం విశేషం. 

 

ఇదే వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ తారక్ ముఖ్య అతిథులుగా రానున్నట్టు ఓ టాక్ వినిపించింది. అయితే, ఏ కారణం వల్లో రామ్ చరణ్ రావడం లేదు కానీ తాజాగా కేవలం యంగ్ టైగర్ మాత్రం వస్తున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భరత్ బహిరంగ సభకు ప్రేమతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ భరత్ అనే నేను చిత్ర నిర్మాతలు విడుదల చేసిన పోస్టర్లకు సోషల్ మీడియాలో మంచి స్పందన కనిపిస్తోంది. 

 

హీరోల మధ్య ఎటువంటి పోటీలు లేవు. ఒకరి సినిమా ఫంక్షన్స్‌కి మరొకరు మనస్పూర్తిగా వెళ్లి తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవు అని చాటిచెప్పేలా అప్పుడప్పుడు చోటుచేసుకుంటున్న ఇటువంటి సినిమా ఫంక్షన్స్ అభిమానుల్లోనూ ఐక్యత భావాన్ని పెంపొందించుతుండటం ఆహ్వానించదగిన పరిణామం.

Trending News