చిత్రసీమలో విషాదం.. నటి మనీషా దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో నటి మనీషా దుర్మరణం పాలైంది.

Last Updated : May 20, 2018, 04:22 PM IST
చిత్రసీమలో విషాదం.. నటి మనీషా దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో నటి మనీషా దుర్మరణం పాలైంది. ఉత్తరప్రదేశ్ బలియాలోని చిట్టౌనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భోజ్‌పురి నటి మనీషా రాయ్(45) శనివారం మృతి చెందింది. ఓ షూటింగ్‌లో పాల్గొనేందుకు బైక్‌పై వెళ్తున్న ఆమెను వెనుక నుంచి వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనీషా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మనీషాతో పాటు బైకుపై ప్రయాణిస్తున్న సహనటుడు సంజీవ్ మిశ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పలు టీవీ సీరియళ్లతోపాటు చిత్రాల్లోనూ మనీషా నటించారు. ఖోబర్‌ అనే లఘు చిత్రం ద్వారా మనీషా పాపులర్‌ అయ్యారు. మనీషా మృతి పట్ల భోజ్‌పురి చిత్రసీమలో విషాదం నెలకొంది.

Trending News