పవన్ కళ్యాణ్ పై మళ్ళీ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ పై సినీ క్రిటిక్ కత్తి మహేష్ మళ్లీ పలు ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Mar 19, 2018, 12:45 AM IST
పవన్ కళ్యాణ్ పై మళ్ళీ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ పై సినీ క్రిటిక్ కత్తి మహేష్ మళ్లీ పలు ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ మాటలకు, చేతలకు సంబంధం ఉండడం లేదని తెలిపారు. అమరావతిలో ఎకరం భూమి రూ.15 కోట్లు రూపాయలు ఉండగా.. తాను కేవలం రూ.20 లక్షలకే తీసుకోవడం వెనుక ఉన్న కారణాలు ఏమిటో  బహిర్గతం చేయాలని ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

పవన్ కళ్యాణ్ నిజాయతీని కూడా శంకించే అవకాశం లేకపోలేదని.. ఏపీ కోసం నిరాహార దీక్ష చేస్తానన్న పవన్.. నిజంగానే దీక్ష చేసే సూచనలు లేవని కత్తి తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎటూ పాలుపోలేక.. పవన్ కళ్యాణ్‌తో కలిసి వెళ్తున్నారని కత్తి మహేష్ అన్నారు. ప్రత్యేక హోదాపై స్పందించిన కత్తి మాట్లాడుతూ ఈ విషయంలో ఎంపీలతో సహా అందరూ విఫలం చెందారని అన్నారు. 

Trending News