బస్సు నదిలో పడి 20 మంది మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది.

Last Updated : Apr 18, 2018, 06:45 AM IST
బస్సు నదిలో పడి 20 మంది మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20మంది మృతిచెందారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు.పెళ్ళిబృందాన్ని తీసుకెళ్తున్న  ఓ మినీ ట్రక్కు సిహావల్ లోని పంరియా గ్రామానికి వెళుతోంది. ఆ ప్రయాణంలోనే ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా, సోనే నది వంతెనపై నుంచి ఆ మినీ ట్రక్కు పడిపోయింది. బస్సులో చాలా మంది ఇరుక్కుపోయారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా యంత్రాంగం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ట్రక్కులో ఇరుకున్న వారిని గ్యాస్ కట్టర్ సాయంతో బయటకు తీసినట్లు అధికారులు వెల్లడించారు.  చనిపోయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. గాయపడినవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Trending News