ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ పై చిల్లీ పౌడరుతో దాడి..!

    

Last Updated : Nov 20, 2018, 07:44 PM IST
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ పై చిల్లీ పౌడరుతో దాడి..!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చిల్లీ పౌడరుతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. తొలుత వినతి పత్రం సమర్పించడానికి సీఎం ఆఫీసు ప్రాంగణంలోకి వచ్చిన ఆ వ్యక్తి.. దానిని సీఎంకు అందించాడు. తర్వాత పాదాలకు వందనం చేస్తున్నట్లు నటిస్తూనే జేబులో నుండి చిల్లీ పౌడర్ తీసి సీఎం ముఖానికి పూయడానికి ప్రయత్నించాడు. అయితే.. సెక్యూరిటీ అధికారులు వేగంగా స్పందించడంతో ఆ వ్యక్తిని నియంత్రించడం సాధ్యమైంది. తర్వాత ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ వ్యక్తిని 40 సంవత్సరాల అనిల్ కుమార్ శర్మగా గుర్తించారు. ఆ వ్యక్తి కేజ్రీవాల్‌ని కలవడానికి వచ్చినప్పుడు.. సీఎం లంచ్ బ్రేక్‌కి వెళ్లాల్సి ఉంది. ఈ ఘటన సీఎం ఆఫీసు థర్డ్ ఛాంబర్ బయట జరిగింది. ఈ ఘటన పై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి అల్కా లాంబా మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీస్ అధికారులు సీఎం రక్షణ విషయంలో అశ్రద్ధగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం సూచనల మేరకే వారు పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. 

అయితే ఈ ఘటన జరిగాక.. ఢిల్లీ బీజేపీ యూనిట్ తరఫున మనోజ్ తివారీ మాట్లాడారు. తాము ఈ దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేసి.. కారకులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. బీజేపీకీ ఈ దాడికి ఏం సంబంధం లేదని ఆయన తెలిపారు. 

Trending News