Kishan Reddy: ఇండో-చైనా బార్డర్ వద్ద మరో 47 ఔట్ పోస్టులకు అనుమతి

భారత్ చైనా మధ్య గల్వాన్ వ్యాలీలో ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో ప్రభుత్వం కొత్తగా 47 బార్డర్ ఔట్ సోస్టులను ( BoPs) ఏర్పాటు చేయడానికి ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసు ( ITBP)కి అనుమతి ఇచ్చింది.

Last Updated : Oct 24, 2020, 11:01 PM IST
    • భారత్ చైనా మధ్య గల్వాన్ వ్యాలీలో ఘర్షణ వాతావరణం
    • కొత్త 47 బార్డర్ ఔట్ సోస్టులను ఏర్పాటు చేయడానికి ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసుకి అనుమతి
Kishan Reddy: ఇండో-చైనా బార్డర్ వద్ద మరో 47 ఔట్ పోస్టులకు అనుమతి

భారత్ చైనా మధ్య గల్వాన్ వ్యాలీలో ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో ప్రభుత్వం కొత్తగా 47 బార్డర్ ఔట్ సోస్టులను ( BoPs) ఏర్పాటు చేయడానికి ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసు ( ITBP )కి అనుమతి ఇచ్చింది. సరిహద్దు వెంబడి గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

Also Read  | AP Grama Sachivalayam 2020 Results: అక్టోబర్ చివరిలో గ్రామ సచివాలయం ఫలితాలు

కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి చ ( Kishan Reddy) ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. గ్రేటర్ నోయిడాలో ఐటిబిపి నిర్వహించిన 59వ రైజింగ్ డే వేడుక సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. 3,488 కిలోమీటర్ల ఇండో-చైనా బార్డర్ లో గస్తీ కాయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడు సెంట్రల్ ఆర్మ్ పోలీసు ఫోర్సుల్లో ఐటీబీపి ( CAPF ) కూడా బాగం. 

ఐటిబిపికి మరో 28 రకాల కొత్త వాహన శ్రేణిని అందిస్తాము అని.. వాటి కోసం ప్రభుత్వం సుమారు రూ.7,223 కోట్లు ఖర్చు చేయనుంది అని తెలిపారు. లోక కళ్యాణం కోసం భారతీయులు పాటించే మంత్రం వసుదైవ కుటుంబకం. అంటే ప్రపంచ శాంతిని కాంక్షించే వాళ్లం అని. కానీ శత‌ృవుల నుంచి కాపాడుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధం అవడం కూడా ముఖ్యమే అని తెలిపారు కిషన్ రెడ్డి.

Also Read | TS EAMCET 2020 Results: ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలు విడుదల

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News