ఆ నినాదాలతో సంబంధం లేదు: ఆర్ఎస్ఎస్

బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్.. మోదీ ప్రభుత్వం చేస్తున్న ‘కాంగ్రెస్‌ విముక్త భారత్‌’ నినాదంపై స్పందించింది.

Last Updated : Apr 2, 2018, 04:34 PM IST
ఆ నినాదాలతో సంబంధం లేదు: ఆర్ఎస్ఎస్

పూణే: మోదీ ప్రభుత్వం చేస్తున్న 'కాంగ్రెస్ ముక్త్ భారత్' వంటి నినాదాలు రాజకీయపరమైనవేనని, వీటితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అటువంటి నినాదాలు అనుచితమని, అది ఆర్ఎస్ఎస్ భాష కాదన్నారు. విముక్తి అనే మాటను రాజకీయాల్లోనే వాడుతుంటారని.. ఎవరినీ వేరుగా చూసే భాష మేము వాడబోమని భగవత్ అన్నారు.

బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్.. మోదీ ప్రభుత్వం చేస్తున్న ‘కాంగ్రెస్‌ విముక్త భారత్‌’ నినాదంపై ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. జాతి నిర్మాణంలో భాగంగా వ్యతిరేకించిన వారిని సైతం కలుపుకుని పోవాలనేదే తమ సిద్ధాంతమని పూణేలో పేర్కొన్నారు. పుణేలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సానుకూల వైఖరి ఎంతో అవసరమని అన్నారు. ప్రతికూల భావాలున్నవారే సంక్షోభాలు, విభేదాల గురించే ఆలోచిస్తారన్నారు. అలాంటి వారు జాతి నిర్మాణ ప్రక్రియలో ఏ మాత్రం ఉపయోగపడరని స్పష్టం చేశారు.

Trending News