EPFO News: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త, మార్చ్ 2022 వరకూ అవకాశం

EPFO News: ఉద్యోగులకు ఈపీఎఫ్ శుభవార్త అందించింది. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగం కోల్పోయినవారికి గొప్ప వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ చందాదారులకు ఈ అవకాశం లభించనుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 23, 2021, 08:43 AM IST
EPFO News: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త, మార్చ్ 2022 వరకూ అవకాశం

EPFO News: ఉద్యోగులకు ఈపీఎఫ్ శుభవార్త అందించింది. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగం కోల్పోయినవారికి గొప్ప వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ చందాదారులకు ఈ అవకాశం లభించనుంది.

కరోనా సంక్షోభ(Corona Crisis) సమయంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. సంక్షోభం అనంతరం కొందరు తిరిగి విధుల్లో చేరారు. ఇలాంటివారి కోసమే ఈపీఎఫ్ గుడ్‌న్యూస్ అందించింది. ఓసారి ఉద్యోగం కోల్పోయి..తిరిగి విధుల్లో చేరిన ఈపీఎఫ్ ఖాతాదారులకు 2022 వరకూ ఉద్యోగులు చెల్లించే మొత్తంతో పాటు యాజమాన్యం చెల్లించే మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించనుందని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman)తెలిపారు. ఈపీఎఫ్‌లో నమోదైన సంస్థల్లో పనిచేసేవారికి మాత్రం ఈ అవకాశం లభిస్తుంది. దీనికి సంబంధించిన విధి విధానాల్ని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ అవకాశం మార్చ్ 31, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. మరోవైపు నెలకు 15 వేలలోపు వేతనం కలిగినవారికే ఈ బెనిఫిట్ వర్తించనుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(EPFO)పరిధిలోకి జూన్‌లో 12.83 లక్షలమంది కొత్తగా చేరినట్టు తెలుస్తోంది. ఈపీఎఫ్  సభ్యులకు పదవీ విరమణపై ప్రొవిడెంట్ ఫండ్, పెన్షన్ ప్రయోజనాలు, కుటుంబ పెన్షన్, సభ్యుడు అకాల మరణం చెందితే కుటుంబాలకు భీమా ప్రయోజనం అందిస్తోంది. 

Also read: West Bengal Violence: పశ్చిమ బెంగాల్ హింసపై సీబీఐ విచారణ ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News