న్యూఢిల్లీ: కొన్ని సర్కార్ ఆస్పత్రులలో నిర్లక్ష్యం తిష్ట వేసుకుకూర్చుంటుందనేది తరచుగా వినపడే ఆరోపణ. దేశంలోని మారుమూల ప్రాంతమైనా.. దేశ రాజధాని అయినా అందుకు అతీతం కాదని తాజాగా దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన నిరూపించింది. ఢిల్లీలోని అరుణా ఆసఫ్ అలీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ రోగికి ఎక్కించడానికి సిద్ధం చేసిన డెట్రాక్స్ నార్మల్ సెలైన్(డీఎన్ఎస్) గ్లూకోజ్ బాటిల్లో ఫంగస్ కనిపించడం ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను, వారి బంధువులను షాక్కి గురిచేసింది. ''కొద్దిలో ప్రమాదం తప్పింది కానీ లేదంటే ఒకవేళ అందులోని ఫంగస్ను గుర్తించకుండా ఎక్కించి వుండి వుంటే, వారి ప్రాణాలు పోయే అవకాశముండేది'' అని స్వయంగా ఆస్పత్రి వైద్యులే చెబుతున్నారు.
ఈ ఘటన అనంతరం తేరుకున్న ఆస్పత్పి సూపరింటెండెంట్.. ఆ బ్యాచ్కు చెందిన అన్ని గ్లూకోజ్ బాటిళ్లను పరిశీలన కోసం ల్యాబ్కు పంపించి దర్యాప్తు చేపట్టారు.