మోదీని హతమారుస్తామని ప్రకటించిన ఉగ్ర సంస్థ

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా మితిమీరిన వ్యాఖ్యలు చేసింది.

Last Updated : Jun 8, 2018, 03:04 PM IST
మోదీని హతమారుస్తామని ప్రకటించిన ఉగ్ర సంస్థ

రావాల్‌కోట్:  పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా మితిమీరిన వ్యాఖ్యలు చేసింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హతమార్చి, భారత్‌ను విచ్ఛిన్నం చేస్తామని ఆ సంస్థ సభ్యుడు మౌలానా బాషిర్ అహ్మద్ ఖాకి ప్రకటించాడు. పవిత్ర రంజాన్ మాసంలో జిహాదీ యుద్ధాన్ని ప్రకటించాలని మౌలానా బాషర్ పిలుపునిచ్చాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని రావాల్కోట్ పట్టణంలో పవిత్ర రంజాన్ 2018 మాసంలో శుక్రవారం మత ప్రార్థనలకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. 

 

జిహాద్‌కు రంజాన్ మంచి సమయం అని, జీహాదీలో ప్రాణాలు కోల్పోతే స్వర్గానికి వెళ్తారని అన్నాడు. కశ్మీర్‌లో భారత భద్రతా దళాలతో జమాత్ ఉద్ దవా సభ్యులు జిహాదీ కొనసాగిస్తున్నారని, కశ్మీర్ స్వేచ్ఛ కోసం, భారత్‌ను నాశనం చేయాలన్న లక్ష్యంతో వాళ్లు పనిచేస్తున్నట్లు తెలిపాడు. కాగా పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ అంతర్జాతీయ ఉగ్రవాది హాఫీజ్ సయీద్‌కు చెందినది. స‌యీద్ గ‌త ఏడాది జ‌న‌వ‌రి నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు హౌజ్ అరెస్టులో ఉన్నాడు.

Trending News