'నెలవంక గల ఆకుపచ్చ జెండాలను నిషేధించండి'

దాయాది దేశం పాకిస్థాన్ జెండాలను పోలిన ఆకుపచ్చ జెండాలను భారత్‌లో నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సయ్యద్ వసీం రజ్వీ పిటిషన్ దాఖలు చేశారు.

Last Updated : Jul 16, 2018, 09:13 PM IST
'నెలవంక గల ఆకుపచ్చ జెండాలను నిషేధించండి'

దాయాది దేశం పాకిస్థాన్ జెండాలను పోలిన ఆకుపచ్చ జెండాలను భారత్‌లో నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సయ్యద్ వసీం రజ్వీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కేంద్రం అభిప్రాయం తీసుకొని తుది నిర్ణయం ప్రకటిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలో చాలా చోట్ల నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ జెండాలను ఎగురవేస్తున్నారని.. దీంతో హిందూ-ముస్లింల మధ్య విభేదాలు నెలకొనే ప్రమాదం ఉందని రజ్వీ పేర్కొన్నారు. కేంద్ర అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా అదనపు సోలిటరీ జనరల్‌ తుషార్‌ మెహతాను జస్టిస్‌ ఎకే సిక్రి, అశోక్‌ భూషన్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కోరింది.

నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ జెండా 1906 ఢాకాలో మహ్మద్‌ అలీ జిన్నా స్థాపించిన ముస్లిం లీగ్‌ పార్టీకి చెందినదని రజ్వీ పిటిషన్‌లో పేర్కొన్నారు. మన దేశంలోని ముస్లింలు దీన్ని ఇస్లామిక్‌ జెండాగా భావిస్తున్నారని అన్నారు. భారతదేశం నుండి విడిపోయాక 1947లో పాకిస్థాన్ ఈ జెండానే నమూనాగా తీసుకొని జాతీయ జెండాను రూపొందించిందని తెలిపారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో భవనాలపైన, మత స్మారక కట్టడాలపైన ఆకుపచ్చ జెండాను పొలిన జెండాలను ఎగరవేస్తున్నారని వసీం రజ్వీ తెలిపారు. అలాంటి జెండాలకు దేశంలో స్థానం లేదని, మత విద్వేషాలను సృష్టించే అవకాశం ఉందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Trending News