సూరత్‌లో కథువా తరహా ఉదంతం

దేశమంతా కథువా అత్యాచార ఘటనతో ఆగ్రహంతో ఉన్నవేళ గుజరాత్‌లోని సూరత్‌లో ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.

Last Updated : Apr 15, 2018, 05:35 PM IST
సూరత్‌లో కథువా తరహా ఉదంతం

దేశమంతా కథువా అత్యాచార ఘటనతో ఆగ్రహంతో ఉన్నవేళ గుజరాత్‌లోని సూరత్‌లో ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తొమ్మిది సంవత్సరాల బాలిక మృతదేహాన్ని ఏప్రిల్ 9న ఊరి శివార్లలో గుర్తించిన పోలీసులు పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె శరీరంపై 86 గాయాలున్నాయని, ఆమెను అత్యాచారం చేసి చంపేసి ఉండవచ్చని తెలిపారు. దీంతో ఆ చిన్నారి ఎవరు? ఈ దారుణానికి ఎవరు ఒడిగట్టారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నివేదికలు ఆ బాలికను కర్ర లేదా బలమైన వస్తువుతో కొట్టి ఉంటారని తెలిపాయి. ప్రస్తుతానికి ఆ బాలిక ఎవరో ఇంకా గుర్తించలేదు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. ఎవరైనా బాలికను గుర్తించి  సమాచారం అందిస్తే రూ.20,000 బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

Trending News