ఓపిక పట్టండి..ప్రతిపక్షాల బలమేంటో తెలుస్తుంది- బీజేపీ నేతలకు సోనియా చురకలు

అవిశ్వాస తీర్మానం విషయంలో ప్రతిపక్ష పార్టీల బలాన్ని బీజేపీ నేతలు తక్కువ  మాట్లాడటంపై సోనియాగాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు

Last Updated : Jul 19, 2018, 03:36 PM IST
ఓపిక పట్టండి..ప్రతిపక్షాల బలమేంటో తెలుస్తుంది- బీజేపీ నేతలకు సోనియా చురకలు

ఢిల్లీ: అవిశ్వాసం నెగ్గడానికి ప్రతిపక్షాలకు సరైన బలం లేదని బీజేపీ నేతలు ఎద్దేవా చేయడంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఘాటుగా స్పందించారు. గురువారం సోనియాగాంధీ ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.. బీజేపీ వారు ప్రతిపక్షాలకు బలం లేదంటున్నారు.. వాళ్లు ఓవర్ కాన్ఫిడెన్స్‌‌తో ఇలా అంటున్నారు తప్పితే వాస్తవం మరోలా ఉందని వ్యాఖ్యానించారు.  మాకు బలం లేదని ఎవరన్నారు ? ప్రతిపక్షాల బలమేంటో ఓటింగ్ వరకు వేచి చూడండి.. అప్పుడు మీకే తెలుస్తుందంటూ బీజేపీ నేతలకు సోనియా సురకలు అంటించారు. 

టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష సభ్యుల మద్దతు ఉండటంతో స్పీకర్ సుమిత్ర మహాజన్ గురువారం దీన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం దీనిపై చర్చ జరిపి ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న మాటల యుద్ధంలో భాగంగా బీజేపీ నేతలు ప్రతిపక్షాలకు సరైన బలం లేదని ఎద్దేవ చేశారు...దీనిపై స్పందించిన సోనియా కమలనాథులకు ఈ విధంగా ఘాటుగా సమాధానమిచ్చారు. బీజేపీ నేతలది ఓవర్ కాన్ఫిడెన్స్ సరే..సోనియా ఏ కాన్ఫిడెన్స్ తో అలా మాట్లాడరనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Trending News