సంచలనం సృష్టించిన హత్య కేసు: తాగి వచ్చిన కొడుకును హతమార్చిన ఎమ్మెల్సీ భార్య !

తాగి వచ్చిన కొడుకును హతమార్చిన ఎమ్మెల్సీ భార్య !

Last Updated : Oct 22, 2018, 11:06 PM IST
సంచలనం సృష్టించిన హత్య కేసు: తాగి వచ్చిన కొడుకును హతమార్చిన ఎమ్మెల్సీ భార్య !

తప్పతాగి ఇంటికొచ్చిన కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వాగ్వీవాదనకు దిగడాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఓ తల్లి.. కొడుకునే హతమార్చిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల యువకుడు ఎవరో కాదు.. ఆ రాష్ట్ర ఎమ్మెల్సీ కౌన్సిల్ చైర్మన్ రమేష్ యాదవ్ తనయుడు అభిజీత్ యాదవ్. ఆదివారం దార్-ఉల్-షఫాలోని రమేష్ యాదవ్ ఇంట్లో అభిజీత్ యాదవ్ శవమై కనిపించాడు. అభిజీత్ యాదవ్ గుండెపోటుతో మృతి చెందాడని, కొడుకు ఛాతిలో నొప్పిని నివారించడానికి అతడి ఛాతిపై రకరకాల బామ్స్ రుద్దుతూ రాత్రంతా నిద్రలేకుండా గడిపానని చెప్పి ఇరుగుపొరుగును నమ్మించారామె. అయితే, ఈ ఘటనపై రమేష్ యాదవ్ భార్య మీనా యాదవ్ చెబుతున్న భిన్నమైన కథనాలపై అనుమానం వచ్చిన పోలీసులు అభిజీత్ అంత్యక్రియలు అడ్డుకుని అతడి శవాన్ని పోస్టు మార్టంకు తరలించారు. పోస్ట్ మార్టంలో అభిజీత్ ఊపిరాడక చనిపోయినట్టుగా నివేదిక రావడంతో ఆదివారం రాత్రే పోలీసులు మీనా యాదవ్‌ని అదుపులోకి తీసుకుని విచారించారు. తమ విచారణలో మీనా యాదవ్ తన నేరాన్ని అంగీకరించినట్టుగా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు. 

నిత్యం తప్ప తాగి ఇంటికొచ్చే అభిజీత్ శనివారం రాత్రి కూడా ఎప్పటిలాగే తాగి ఇంటికొచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తనపై దుర్భాషలాడానని మీనా యాదవ్ పోలీసులకు తెలిపారు. ఒకసారి అతడిని తోసేయగా కిందపడిన అభిజీత్ మళ్లీ లేచివచ్చి దుర్భాలాడుతుండటంతో అతడిని ఊపిరాడకుండా చేసి హతమార్చినట్టు మీనా యాదవ్ అంగీకరించినట్టుగా పోలీసులు మీడియాకు వెల్లడించారు. రమేష్ యాదవ్‌కి మీనా యాదవ్ రెండో భార్య కాగా ఆమె ఇటీవలే ఆ రాష్ట్ర పర్యాటక శాఖలో తన ఉద్యోగాన్ని వదిలేసి, రమేష్ యాదవ్‌తోపాటు తమ ఇద్దరు కొడుకులైన అభిషేక్, అభిజీత్ యాదవ్‌లతో కలిసి ఉంటున్నారు. 

Trending News