Patangi Toll plaza: సంక్రాంతిని గుర్తుకు తెచ్చిన ఓట్ల పండగ.. పతంగీ టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..

Traffic Jam: హైదరాబాద్ నుంచి ఏపీకీ భారీగా తమ వాహానాలలో వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేల మీద వాహనాలు రద్దీ నెలకొంది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
 

  • May 11, 2024, 14:15 PM IST
1 /6

దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తుంది. ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో ఓట్లు వేయడానికి జనాలు తమ సొంత గ్రామాలకు భారీగా క్యూలు కట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే బస్సులు, రైళ్లు, విమానాలు కూడా కిట కిటలాడుతున్నారు. ఇక ప్రైవేటు వాహానాలు భారీగా రెట్లను పెంచేశాయి.  

2 /6

ఒకప్పుడు ఏపీకి సంక్రాంతి పండుగ నేపథ్యంలో పంతిగి టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయి కన్పించేది. ప్రస్తుతం ఏపీలో మే 13 న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఓట్లు వేయడానికి ఏపీ వాసులంతా పెద్ద ఎత్తున వెళ్తున్నారు. కొందరు పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ లలో వెళ్తున్నారు.

3 /6

ఇక విమానాలలో కూడా కొందరు తమ గ్రామాలకు చేరుకుంటున్నారు. అదే విధంగా శని,ఆదివారం,సోమవారం వరుస సెలవుల నేపథ్యంలో ప్రజలంతా సొంతవూర్ల బాట పడ్డారు. తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

4 /6

ప్రయాణికుల రద్దీనిబట్టి ఇప్పటికే ఆయా మార్గాలలో అధికంగా బస్సులను ఏర్పాటు చేశారు. అయిన కూడా ప్రయాణికులు సరిపోవట్లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రైవేటు ఏజెన్సీలు, ఇతర వాహానాలు అందిన కాడికి ప్రజలను దోచుకుంటున్నారు.   

5 /6

తమ గ్రామాలకు చేరుకోవాలని కొందరు విమానంలో కూడా వెళ్తున్నారు. దీంతో విమానయాన సంస్థలు కూడా తమ రుసుములను భారీగాపెంచేశాయి. సాధారణంగ కంటే, ఇరవై నుంచి ముప్పైరెట్లు రుసుమును అధికంగా పెంచేశాయి.  ఈనేపథ్యంలోనే చాలా మంది తమ ప్రయాణాలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

6 /6

హైదరాబాద్, విజయవాడలో భారీగా వాహనాలతో ట్రాఫిక్ జాబ్ వల్ల పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వాహానాలను క్లియర్ చేస్తు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టారు. మొత్తానికి ఈరోజు రేపు, ఇలానే కొంత ట్రాఫీక్ రద్దీ ఉంటుందని కూడా పోలీసులు చెబుతున్నారు.