కేరళ ఆలయానికి 'ముఖ్య అతిథి' గా ధోనీ కుమార్తె జీవా

Last Updated : Nov 9, 2017, 05:35 PM IST
కేరళ ఆలయానికి 'ముఖ్య అతిథి' గా ధోనీ కుమార్తె జీవా

కేరళలోని ఒక ప్రముఖ ఆలయానికి ధోనీ కుమార్తె జీవా ముఖ్య అతిథిగా వెళ్లనుంది. ఇటీవల జీవా ఒక మలయాళం పాట పాడుతున్న వీడియోని ధోనీ భార్య సాక్షి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయిపొయింది. ఈ వీడియోను చూసిన ట్రావెన్ కొర్ దేవస్వామ్ బోర్డు (టీడీబీ) చైర్మన్ కు ఎంతో నచ్చింది. రెండేళ్ల పాప ఇంత బాగా పడుతుందా? అంటూ ఆశ్చర్యపోయారు. 

ఇంకేముంది ఇది చూసిన ఆయన  2018 జనవరి 14 నుంచి కేరళ అంబళపూజాలోని శ్రీ కృష్ణుడి ఆలయంలో నిర్వహించే ఉత్సవాలకు జీవా ముఖ్య అతిథిగా రావాల్సిందిగా కోరారు. జీవా ముద్దుగా మలయాళం పాట పాడటం నిజంగా తనకెంతో ముచ్చటేసింది.. వీలుంటే ధోని తన భార్య సాక్షితో పాటు జీవాను కూడా తీసుకురావాలని ఆయన తెలిపారు. జీవా పాడిన పాట మలయాళం నటుడు మోహన్ లాల్ నటించిన 'అద్వైతం' చిత్రం లోనిది కావడం గమనార్హం. 

 

@mahi7781 @sakshisingh_r ❤️❤️. Song taught by “Sheila Aunty”(her Nanny from Kerala)

A post shared by ZIVA SINGH DHONI (@zivasinghdhoni006) on

 

Trending News