శ్రీలంకపై రెండో టీ20లో టీమిండియా విన్

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

Last Updated : Mar 13, 2018, 01:33 PM IST
శ్రీలంకపై రెండో టీ20లో టీమిండియా విన్

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌ను వాన పడడం వల్ల 19 ఓవర్లకు కుదించడం జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయడం గమనార్హం. ఆ తర్వాత 153 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా కేవలం 4 వికెట్లను మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించింది. భారత ఓపెనర్లు శిఖర్‌ధావన్ ‌(8), రోహిత్‌ శర్మ(11), లోకేశ్‌ రాహుల్‌(18)పెద్దగా ఏమీ ఆడకపోయినా.. లోకేశ్‌ సురేశ్‌ రైనా(27), మనీశ్‌ పాండే(42*), దినేశ్‌ కార్తీక్‌(39*) స్కోరుని పరుగెత్తించడంతో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో షర్దుల్ ఠాకూర్ 4 వికెట్లు తీయడం గమనార్హం

 

Trending News