Rains in Telangana: హైదరాబాద్: నగరంలో శుక్రవారం పలు చోట్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలు కనిపించినప్పటికీ.. సాయంత్రానికి ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షానికి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు తోడవడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
భారీ వర్షాలతో దేశంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే అతలాకుతలం అవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, పూనే, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD) దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం: బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి చచ్చి మళ్లీ పుడుతుందంటుంటారు. ఒక తల్లి ప్రసవ వేధన అలాంటిది. కానీ ఇక్కడ వీడియోలో మనం చూస్తున్న ఈ గర్భిణికి ( Pregnant woman ) ఆస్పత్రికి చేరుకోవడంలోనే పురిటినొప్పుల కంటే ఎక్కువ కష్టాలు ఎదురయ్యాయి.
Heavy Rains In Delhi | ఢిల్లీతో సహా దేశ రాజధాని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రవాణాకు అడ్డంకులు తలెత్తుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. నైరుతి రుతుపవనాలు ఆశించినట్టుగానే జూన్ 1వ తేదీన కేరళను తాకాయి. రుతు పవనాల రాకతో కేరళలో రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ ( IMD ) వెల్లడించింది. కేరళలోని కొయికోడ్ జిల్లాలో ( Kozhikode ) భారీ వర్షపాతం నమోదైంది.
ఎండ వేడిమి నుంచి మరికొద్దిరోజుల్లోనే ఉపశమనం..! తీపి కబురు మోసుకొచ్చింది భారత వాతావరణ శాఖ. అవును మరో మూడు రోజుల్లో వాతావరణం చల్లబడిపోతుందని భారత వాతావరణ శాఖ...IMD తెలిపింది.
కోల్కతా : అంఫాన్ తుఫాన్ ( Cyclone Amphan ) భారీ ప్రాణ, ఆస్టి నష్టాన్ని మిగిల్చింది. కేవలం పశ్చిమ బెంగాల్లోనే ( West Bengal ) అంఫాన్ తుఫాన్ తాకిడికి 72 మంది మృతి చెందినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( CM Mamata Banerjee ) తెలిపారు. చనిపోయిన 72 మందిలో 15 మంది కోల్కతాకు చెందిన వారేనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.
అంఫన్ తుఫాన్ తీరాన్ని తాకే ప్రక్రియ ( Landfall of Cyclone Amphan ) మొదలైంది. నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ప్రక్రియ మొదలవగా.. దాదాపు 4 గంటలపాటు సైక్లోన్ ల్యాండ్ ఫాల్ కొనసాగుతుందని ఒడిషాలోని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పికే జనా తెలిపారు. ఇప్పటికే పారాదీప్, కెండ్రపారా, ధమ్ర దాటేసిన అంఫాన్ తుఫాన్.. ప్రస్తుతం బాలాసోర్ను ( Balasore in Odisha ) ఆనుకుని ఉన్న తీరం వద్ద కొనసాగుతుందని అన్నారు.
కొన్ని కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. 2020 ఏడాదిలో సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్టు వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షాకాలంలో వర్షాలు 100% సమృద్ధిగా కురుస్తాయని కేంద్ర భూగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ తెలిపారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదు కావడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. బేగంపేట్, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ ఆర్ నగర్, కూకట్పల్లి, మూసాపేట్, బంజారాహిల్స్,
బుల్బుల్ తుఫాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతుండగా అదే సమయంలో తుఫాను ప్రభావంతో ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.