తెలంగాణలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం

తెలంగాణలోని వరంగల్‌లో ఏడేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

Last Updated : Apr 15, 2018, 10:42 PM IST
తెలంగాణలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం

తెలంగాణలోని వరంగల్‌లో ఏడేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..అమరావతి నగరులో ఒకటవ తరగతి చదువుతున్న ఓ బాలికపై ఆమె ఇంటి పక్కనే ఉండే ఇద్దరు మైనర్ బాలురు గత రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఆ బాలురు ఇద్దరూ అన్నదమ్ములు కావడం గమనార్హం.

చిన్నారిని ప్రలోభపెట్టి అత్యాచారం చేసిన వీరి గురించి బాలిక అస్వస్థతకు గురైనప్పుడు తన తల్లిదండ్రులకు తెలిపింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు స్థానిక సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వరంగల్ పోలీస్ కమీషనరేటు పరిధిలోకి వచ్చే ఈ ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలియజేశారు. అత్యాచారానికి గురైన బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

Trending News