మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం కేసీఆర్.. రాత్రికే తిరుగు ప్రయాణం!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. గత 2 రోజులుగా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో జరుగుతున్న యాగంతో బిజీగా వున్న ఆయన ఇవాళ హారతి పూర్తి చేసుకున్న అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.

Last Updated : Jan 22, 2019, 06:51 PM IST
మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం కేసీఆర్.. రాత్రికే తిరుగు ప్రయాణం!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. గత 2 రోజులుగా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో జరుగుతున్న యాగంతో బిజీగా వున్న ఆయన ఇవాళ హారతి పూర్తి చేసుకున్న అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరివెళ్తారు. ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తనయుడు మయాంక్ వివాహ వేడుకల్లో పాల్గొంటారు. వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరిగి అదే ప్రత్యేక విమానంలో రాత్రికి హైదరాబాద్‌ చేరుకుంటారని అధికారవర్గాలు తెలిపాయి.

Trending News