Crime News : భర్తను భార్యే గొంతు కోసి చంపిందా ? ఆ రాత్రి అసలేం జరిగింది ?

నాగర్‌కర్నూల్ : జిల్లాలోని బిజినేపల్లి మండలం మంగనూరులో దారుణం చోటుచేసుకుంది. భర్తను భార్యే దారుణంగా కత్తితో గొంతుకోసి హతమార్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో మొదట భర్తను గొంతు కోసి చంపిన భార్య.. అతడే ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించేందుకు ప్రయత్నించినట్టు స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

Last Updated : May 12, 2020, 03:09 AM IST
Crime News : భర్తను భార్యే గొంతు కోసి చంపిందా ? ఆ రాత్రి అసలేం జరిగింది ?

నాగర్‌కర్నూల్ : జిల్లాలోని బిజినేపల్లి మండలం మంగనూరులో దారుణం చోటుచేసుకుంది. భర్తను భార్యే దారుణంగా కత్తితో గొంతుకోసి హతమార్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో మొదట భర్తను గొంతు కోసి చంపిన భార్య.. అతడే ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించేందుకు ప్రయత్నించినట్టు స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బిజినేపల్లి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మంగనూరుకు చెందిన శ్రీనివాస్, అతని భార్య ఆదివారం రాత్రి ఆరు బయట పడుకున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. అతడే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె చుట్టుపక్కల వారికి చెప్పడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు.

Also read : Flights and trains : మే 31 వరకు రైళ్లు, విమానాలు మాకొద్దని ప్రధానికి సీఎం విజ్ఞప్తి

శ్రీనివాస్ ఎలా చనిపోయాడంటూ అడిగిన ప్రశ్నలకు అతడి భార్య నుంచి పొంతనలేని సమాధానాలు రావడం పోలీసులకు ఆమెపై అనుమానం కలిగేలా చేశాయి. శ్రీనివాస్ వైఖరి విషయమై ఇరుగుపొరుగును ఆరా తీసిన పోలీసులకు మరిన్ని విషయాలు తెలిశాయి. గత కొంత కాలంగా శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడని.. లాక్‌డౌన్‌లో మద్యం లభించకపోవడంతో బాగానే ఉన్నప్పటికీ.. ఇటీవల మద్యం దుకాణాలు తెరవడంతో మళ్లీ మద్యానికి బానిసయ్యాడని తెలిపారు. ఇదే విషయమై తరచుగా భార్యా, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. 

Also read : దిల్ రాజు పెళ్లిపై అంత ఇంట్రస్ట్ ఎందుకంటే..

శ్రీనివాస్ భార్య చెబుతున్న పొంతన లేని సమాధానాలు, అతడి మద్యం అలవాటు విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయని ఇరుగుపొరుగు చెబుతున్న వివరాలను పరిశీలిస్తే.. అతడి వేధింపులను తట్టుకోలేకే ఆమె భర్తను చంపేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు శ్రీనివాస్ భార్యపై అనుమానంతో ఆమె చేతే నిజం చెప్పించాలని భావించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News