పాత బస్తీలో అరాచకం; పోలీసుల ముందే నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

   

Last Updated : Sep 26, 2018, 06:51 PM IST
పాత బస్తీలో అరాచకం; పోలీసుల ముందే నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్ : నగరంలో ఈ రోజు దారుణ హత్య జరిగింది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 140 వద్ద ఓ యువుకుడిని అందరూ చూస్తుండానే నడిరోడ్డుపై అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు. 100 మీటర్ల దూరం వరకు వెంటాడిన దుండగులు అతన్ని  చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. హత్యానంతరం ఘటనా స్థలంలోనే మారణాయుధాలు వదిలి.. దుండుగులు పరారయ్యారు. సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు.. దాడి చేసిన వారిలో ఇద్దరిని పట్టుకున్నట్లు తెలిసింది. కాగా స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేసుకున్న పోలీసులు .. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా హత్యకు గల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

పోలీసుల సాక్షిగా హత్య
హత్య సమయంలో తన రక్షించాలంటూ ఆర్తనాధాలు పెట్టినా ముందుకు వచ్చి ఎవరూ రక్షించలేకపోయారు. అక్కడున్న కొందరు రక్షించేందుకు ప్రయత్నించినా.. అవతలి వ్యక్తి చేతిలో గొడ్డలి ఉండడంతో భయపడుతూ వెనక్కి తగ్గారు. ఈ దారుణ ఘటనను పాదచారులతో సహా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హత్య జరిగిన అతి సమీపంలో పోలీసుల వాహనం ఉండటం గమనార్హం. పోలీసులు ఉన్నా కూడా దారుణకాండను నిలువరించలేకపోయారంటే నగర పరిస్థితులు ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

 

Trending News