మీసేవా కేంద్రాల్లోనూ నగదు డ్రా..!

నగదు కొరత కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు శుభవార్త.

Last Updated : Apr 23, 2018, 08:13 AM IST
మీసేవా కేంద్రాల్లోనూ నగదు డ్రా..!

నగదు కొరత కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు శుభవార్త. తెలంగాణలో త్వరలోనే మీసేవా కేంద్రాల్లోనూ డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఇందుకు అనుమతి కోరుతూ ఆర్బీఐకి ప్రభుత్వం లేఖ రాయగా.. త్వరలోనే అధికారిక అనుమతులు రానున్నాయట. టీ వ్యాలెట్ యాప్‌లో నమోదై ఉన్న ప్రతి ఒక్క ఖాతాదారుడు మీసేవా కేంద్రాల్లో రోజుకు రూ.2 వేల వరకు డ్రా చేసుకోవచ్చట. ఆర్బీఐ నుంచి అనుమతులు వస్తే ఈ విధం వినియోగించుకొనే తొలిరాష్ట్రంగా తెలంగాణ నిలువనుంది.

డ్రా చేసుకోవడం ఇలా

* మీసేవ కేంద్రాల నుంచి నగదు డ్రా చేసుకోవాలంటే ముందుగా టీ వ్యాలెట్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అందులో వివరాలు నమోదు చేసుకోవాలి.

* మీ వద్ద ఫోనే లేకపోతే.. దగ్గర్లో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లి యూఐడీ వివరాలు అందించి టీ వ్యాలెట్‌లో ఖాతాను తెరుచుకోవచ్చు.

* ఖాతా తెరిచేటప్పుడు బయోమెట్రిక్ వివరాలు అందించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే నగదు లావాదేవీలు చేసుకోవడానికి వీలుంటుంది.

* రాష్ట్రంలో ఎక్కడైనా మీసేవ వద్దకు వెళ్లి రోజుకు రెండువేల వరకు డ్రా చేసుకొనే అవకాశం కల్పించనున్నట్టు సమాచారం.

*టీ వ్యాలెట్‌లో బ్యాంక్‌ఖాతా ద్వారా ఆన్‌లైన్ రూపంలో నగదు డిపాజిట్ చేయవచ్చు లేదా నేరుగా టీ వ్యాలెట్ ఖాతాలో నేరుగా జమచేసుకోవచ్చు.

Trending News