Telangana: హనుమకొండ కేఎంసీలో కరోనా కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!

KMC Corona: హనుమకొండ కాకతీయ వైద్య కళాశాలలో కరోనా కలకలం రేగింది. తాజాగా 17 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 06:37 PM IST
Telangana: హనుమకొండ కేఎంసీలో కరోనా కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!

Corona Cases in KMC: హనుమకొండ కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా (KMC Corona Cases) కలకలం రేపింది. తాజాగా 17 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్ (Covid-19) గా నిర్ధారణ అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. వీరిలో కొందరు ఇళ్లకు వెళ్లిపోగా... మరికొందరు హాస్టల్‌లోనే హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత రెండు రోజుల్లోనే హనుమకొండలో 99, మహబూబాబాద్‌లో 75 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో  కొవిడ్‌ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 73,156 పరీక్షలు నిర్వహించగా... 2,606 పాజిటివ్‌ కేసులు (Corona Cases in Telangana) నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,92,357కి చేరింది. వైరస్‌ బారిన పడి ఇద్దరు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,041కి చేరింది. 

Also read: Corona in Telangana: తెలంగాణలో కొవిడ్ కల్లోలం- ఒక్క రోజులో 2 వేలపైకి కేసులు

రేపటి నుంచి బూస్టర్ డోస్ ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ (booster dose in telangana) ప్రక్రియ ప్రారంభం కానుంది. హెల్త్‌ కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లతో పాటు, 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు బూస్టర్‌ డోస్‌కి అర్హులుగా వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే, రెండో డోస్‌ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు మాత్రమే టీకా తీసుకునేందుకు అర్హులుగా వైద్యారోగ్యశాఖ తెలిపింది. బూస్టర్‌ డోస్‌ కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్‌ అక్కర్లేదని స్పష్టం చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News