Hyderabad Metro: సమ్మె బాట పట్టే యోచనలో హైదరాబాద్‌ మెట్రో ఉద్యోగులు..

Hyderabad Metro: నగర మెట్రో ఉద్యోగులు సమ్మె బాట పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఉద్యోగులు కొందరు విధులు బహిష్కరించారు. రెడ్‌లైన్‌ టికెటింగ్‌ ఉద్యోగులు దాదాపుగా విధులకు దూరంగా ఉన్నారు. గత ఐదేళ్లుగా జీతాలు పెంచలేదని వాపోతున్నారు ఉద్యోగులు. కరోనా టైం తప్పిస్తే..

  • Zee Media Bureau
  • Jan 3, 2023, 05:50 PM IST

Hyderabad Metro: నగర మెట్రో ఉద్యోగులు సమ్మె బాట పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఉద్యోగులు కొందరు విధులు బహిష్కరించారు. రెడ్‌లైన్‌ టికెటింగ్‌ ఉద్యోగులు దాదాపుగా విధులకు దూరంగా ఉన్నారు. గత ఐదేళ్లుగా జీతాలు పెంచలేదని వాపోతున్నారు ఉద్యోగులు. కరోనా టైం తప్పిస్తే.. మిగతా రోజుల్లో విరామం లేకుండా పని చేస్తున్నప్పటికీ తమకు సరైన న్యాయం జరగట్లేదని వాపోయారు. సగం మంది ఉద్యోగులే విధులకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇక ఈ పరిణామంపై హైదరాబాద్‌ మెట్రో స‍్పందించాల్సి ఉంది. ఆ స్పందన తర్వాత సమ్మె గురించి ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News