డయాబెటిక్ పేషెంట్స్ కి జొన్న దోశ చాలా మంచిది.. ఈ దోశ చేసుకోవడం కోసం.. ముందుగా ఒక గిన్నెలో అరకప్పు జొన్నపిండి తీసుకోండి.
అందులోనే పావు కప్పు బియ్యప్పిండిని కూడా వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి.
అందులో సరిపడా నీళ్లు పోసుకుని దోశలు వేయడానికి వీలుగా ఉండే పిండిలా కలుపుకోవాలి.
ఇప్పుడు ఆ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, రెండు స్పూన్ల కొత్తిమీర తురుము, 2 తరిగిన పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
అందులోనే అర స్పూను జీలకర్ర వేసుకొని.. ఈ పిండిని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి..
ఇప్పుడు స్టవ్ వెలిగించి పైన పెనాన్ని పెట్టి నూనె రాసి.. వేడెక్కాక ఈ పిండిని దోశలాగా పలచగా వేసుకోవాలి.
రెండు వైపులా బాగా కాల్చుకుంటే ఎంతో క్రిస్పీ జొన్న దోశ రెడీ.