జగన్ ఆదేశిస్తే... : జయసుధ

వైఎస్సార్సీపీ గూటికి.. 

Last Updated : Mar 7, 2019, 07:26 PM IST
జగన్ ఆదేశిస్తే... : జయసుధ

హైదరాబాద్: సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కుమారుడు నిహార్ కపూర్‌తో కలిసి హైదరాబాద్ లోటస్‌పాండ్‌కి వెళ్లిన ఆమె అక్కడ జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం జయసుధతో పాటు ఆమె కుమారుడు నిహార్ కపూర్‌కి జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలో చేరిన అనంతరం జయసుధ మీడియాతో మాట్లాడుతూ.. మాజీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. జగన్ ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధంగా వున్నానని.. జగన్ ఆదేశాల మేరకు పార్టీ కోసమే పనిచేస్తానని జయసుధ తెలిపారు.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆమెకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

Trending News