మిత్రధర్మం వల్లే ఓపిక పట్టాం..హామీలు నెరవేర్చకుంటే జగడమే - చంద్రబాబు

Last Updated : Mar 7, 2018, 01:37 PM IST
మిత్రధర్మం వల్లే ఓపిక పట్టాం..హామీలు నెరవేర్చకుంటే జగడమే - చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సభ్యులను ఉద్దేశించిన సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు. ఇదే సమయంలో టీడీపీపై బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఏమన్నారంటే ..విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చమని మాత్రమే కేంద్రాన్ని కోరుతున్నాం తప్ప అదనంగా ఏమీ అడగడం లేదన్నారు.  మిత్రధర్మం వల్లే ఇనాళ్లు ఓపిక పట్టాం లేదంటే పరిస్థితి మరోరకంగా ఉండేదని కేంద్రంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధే తన తొలి ప్రాధాన్యమన్నారు. ప్రత్యేక ప్యాకేజీ సమయంలోనూ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరానని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.

 

Trending News