Andhra Pradesh: 3 లక్షలు దాటిన కరోనా టెస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఈ మహమ్మారి మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. 

Last Updated : Aug 19, 2020, 05:10 PM IST
Andhra Pradesh: 3 లక్షలు దాటిన కరోనా టెస్టులు

Covid-19 Cases updates : అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఈ మహమ్మారి మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,742 కరోనా కేసులు నమోదు కాగా.. 86 మంది మరణించినట్లు ఏపీ ( Andhra Pradesh ) వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) తెలిపింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం కరోనా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,16,003కి పెరిగింది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 2,906 మంది ప్రాణాలు కోల్పోయారు. Also read: Sunitha: కరోనా నుంచి కోలుకున్న సింగర్

ప్రస్తుతం రాష్ట్రంలో 86,725 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 2,26,372 మంది కోలుకున్నారు. ఇదిలాఉంటే.. ఏపీలో గడిచిన 24 గంటల్లో 57,685 కరోనా టెస్టులు చేశారు. దీంతో ఇప్పటివరకు 30,19,296 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా గత 24గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాలల్లో అత్యధికంగా 15మంది చొప్పున మరణించారు. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..

ap corona bulletin

Also read: Sushant death case: కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు

Trending News